కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో షూటింగ్స్ మొదలయ్యాయి.మేకర్స్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఈ రెండు మూడు రోజులలోనే సర్కారు వారి పాట, భీమ్లానాయక్,పుష్ప రాధే శ్యామ్ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నసర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ విడుదల చేస్తూ జనవరి 13, 2022న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తాజాగా సర్కారు వారి పాట నుండి మరో అప్డేట్ వచ్చింది.ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా మాసివ్ స్వాగ్ ను విట్నెస్ చెయ్యడానికి సిద్ధంగా ఉండమని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే ఆ రోజు చిత్రం నుండి మరో సర్ప్రైజ్ రానుంది. అభిమానులు టీజర్ విడుదల చేస్తారేమో అని ఊహిస్తున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంరట్టైనర్గాఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గీత గోవిందం లాంటి సంచలన బ్లాక్బస్టర్ తర్వాత పరశురామ్ దాదాపు మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. బ్యాంకులో జరిగే ఆర్థిక నేరాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది. తండ్రీ కొడుకు సెంటిమెంట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.