టాలీవుడ్ (Tollywood) నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై పోసాని కృష్ణమురళి (Posani krishna murali) చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) స్పందించారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ మాట్లాడుతూ..పోసాని కృష్ణమురళి ఎక్స్పైరీ (కాలం చెల్లిన) అయిపోయిన టాబ్లెట్ లాంటి వాడని చురకలంటించారు. మొదటిసారి ప్రెస్ మీట్లో పవన్ కల్యాణ్ పై పోసాని తన అభిప్రాయం చెప్పాడు. ఆ తర్వాత రోజు ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ తల్లి గురించి మాట్లాడటం తప్పు. ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బండ్ల గణేశ్ అన్నారు.
ఆ తల్లి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. పోసాని భార్య నా తల్లి వంటిది. ఆయనను భరిస్తున్న ఆమెకు పాదాభివందనం చేస్తా. పోసాని గురించి మాట్లాడితే నా స్థాయి నేను తగ్గించుకున్న వాడినవుతా. పవన్ కల్యాణ్ను ఎంతైనా తిట్టండి. కానీ ఆయన తల్లి అంజనాదేవి, ఇతర ఆడవాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పోసాని ఎవరు అధికారంలో ఉంటే వారి వెంట తిరిగే వ్యక్తిని మండిపడ్డారు.
పోసాని కృష్ణ మురళి ప్రవర్తనను చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటోందన్నారు. వైఎస్సార్సీప్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఇటీవలే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దీంతో పోసాని వరుస ప్రెస్ మీట్లతో పవన్ కల్యాణ్ పై విరుచుకపడ్డారు.
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?