నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడి అవతారమెత్తబోతున్నారు. ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. వెంకట్చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యష్రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతిచంద్ర నిర్మించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో షూటింగ్ ప్రారంభంకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘తమిళంలో పార్తిబన్ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన ‘సెరుప్పుసైజ్ 7’ చిత్రానికి రీమేక్ ఇది. బండ్ల గణేష్ అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలడనిపించింది. ఆయన్ని సరికొత్త పంథాలో చూపించే చిత్రమవుతుంది’ అని తెలిపారు. హిందీలో ఈ చిత్రాన్ని అభిషేక్బచ్చన్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. ఇటీవలే చెన్నైలో చిత్రీకరణ మొదలైంది.