అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ హిట్ విజయ్ కి రాకపోయిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కరోనా వలన నత్తనడకన సాగుతుంది.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందుతన్న లైగర్ చిత్రం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. గోవాలో చిత్రీకరణ జరుగుతుండగా, సడెన్ గా బాలకృష్ణ సెట్లో ప్రత్యక్షం అయ్యారు. పూరీ, ఛార్మీ,విజయ్ ఆయనతో కలిసి ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నందమూరి బాలకృష్ణ సర్ ప్రైజ్ విజిట్ చేసి టీం అందరిని ఆశీర్వదించారు అని టీం పేర్కొంది.
లైగర్ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది.