మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 7 : కరోనా ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న దివ్యాంగుల కుటుంబాలకు మహబూబ్నగర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల పాఠశాలలో 30మంది దివ్యాంగుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకుడు చంద్రశేఖర్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వారిలో సంఘం సభ్యులు వి.ప్రశాంత్, శ్రీకాంత్రెడ్డి, అచ్చుగట్ల బాలరాజు, అమర్నాథ్, రఘ, భాస్కర్, ప్రభాకర్, రమాకాంత్, శేఖర్, రఘవేందర్, శేఖర్, జగదీశ్రెడ్డి ఉన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జూన్ 7 : అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ, అనుబంధ సంస్థల సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన కందూరు వకీల్ భీమయ్య కుమాడు డాక్టర్ రాజేశ్వర్ తన సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులను తీసుకొచ్చి పంచాయతీ సిబ్బంది, ఆశవర్కర్లకు, అంగన్వాడీలకు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచన మేరకు కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం కోనేరు మెట్ల నిర్మా ణం చేసేందుకు ఏర్పాటు చే యాలని చెప్పడంతో సోమవా రం కోనరులో నీళ్లు తోడివేశా రు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీ శామల మ్మ, ఆలయ పాలక మండలి చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.