‘పైసావసూల్’ తర్వాత బాలకృష్ణ,దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానున్నది. గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని కథాంశాల ఎంపికలో తన పంథాను మార్చిన బాలకృష్ణ వరుసగా సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ఆయన వెల్లడించారు. మాస్ అంశాలకు యాక్షన్ హంగులను మేళవించి దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో బాలకృష్ణ ఈ చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ‘అఖండ’ చిత్రీకరణతో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో యాక్షన్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ సినిమా సెట్స్పైకివెళ్లనున్నట్లు తెలిసింది.