తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాలలోకి తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కొన్నాళ్లుగా హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్నదానిపై తనకు బాధ లేదంటూనే అతని రాకతో పార్టీకి నష్టం ఏర్పడితే ఏం చేస్తారని ప్రశ్నించారు బాలయ్య.
ఎన్టీఆర్ తెలుగు దేశంలోకి రావాలి, పార్టీ పగ్గాలు తీసుకోవాలని చాలామంది అంటున్నారు.ఎవరి ఇష్టాఇష్టాలు వాళ్లవి. వాళ్ళ ఇష్టాన్ని బట్టే మాట్లాడతారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తాడా? రాడా అన్న దాని గురించి నేను బాధపడటం లేదు అని అన్నారు బాలయ్య. ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా అని బాలయ్యని యాంకర్ ప్రశ్నించగా, చిరు నవ్వు నవ్వి కాసేపు ఆగిన బాలయ్య ..ఎన్టీఆర్ రావడం వల్ల ప్లస్ అయ్యి ఆ తరువాత మైనస్ అయితే.? ఏంటని తిరిగి ప్రశ్నించారు. ప్లస్, మైనస్ ఆల్ వేజ్ బ్యాడ్.. ప్లస్ ప్లస్, మైనస్ ఈజ్ ప్లస్.. అంటూ ఏవో లెక్కలు చెప్పారు.
సినిమాలలో ఉన్న రామారావు గారు సీఎం అయ్యారుగా అని అన్నీ అవ్వాలంటే కావు. తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలో నుంచి పుట్టింది.. అంతేతప్ప వేరే విధంగా రాలేదు. తెలుగు దేశం కార్యకర్తలు కూడా చాలా నిబద్ధతతో ఉంటారు.. అలాంటి వాళ్లకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. యువతని ఎంకరేజ్ చేయాలని గతంలో కూడా చెప్పాను ఇప్పుడూ చెప్తున్నా’.. అన్నారు. బాలయ్య మాటలని బట్టి చూస్తే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నందమూరి నటసింహం కాస్త అయిష్టంగానే ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే.. తెలుగుదేశం బలపడుతుందని.. ముఖ్యంగా యువతలో చైతన్యం వస్తుందని టీడీపీ కార్యకర్తలు భావిస్తుండగా.. బాలయ్య మాత్రం తన అల్లుళ్లు సమర్ధులు అంటూనే.. ఎన్టీఆర్ వల్ల నష్టం చేకూరే ప్రమాదం ఉందని అనడంతో ఆయన అంతరంగం ఏంటన్నది అర్ధం చేసుకోవ