అంచనాలకు మించి కొనుగోళ్లు
జిల్లాలో 2.60లక్షలమెట్రిక్ టన్నుల సేకరణ
విలువ దాదాపు రూ.490 కోట్లు
48వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బు
ముగిసిన యాసంగి వడ్ల కొనుగోళ్లు
వరంగల్రూరల్, జూన్ 10(నమస్తేతెలంగాణ): వరంగల్ రూరల్ జిల్లాలో అంచనాలకు మించి ప్రభు త్వం ధాన్యం సేకరించింది. రికార్డు స్థాయిలో దాదాపు 2.60 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసిం ది. ట్రాన్స్ పోర్టు పూర్తయ్యేసరికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సర్కారు కాళేశ్వరం ఎత్తిపో తల ప్రాజెక్టు నీటిని ఊరూరికి అందించడంతో జిల్లాలోని రైతులు యాసంగి వరి పంటను 1,31,656 ఎకరాల్లో సాగు చేశారు. దీంతో సుమారు 2.78 లక్షల టన్నుల ధా న్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవ సాయశాఖ అధికారులు భావించారు. ఇందులో 50 వేల టన్నులు రైస్ మిల్లర్లు కొనొచ్చని, మరో 28 వేల టన్ను లు స్థానిక అవసరాలకు పోతే మిగతా రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఏప్రిల్ మూడోవారం నుంచి దశల వారీగా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ మద్ద తు ధరతో ధాన్యం కొనుగోలు చేశారు. నెలపదిహేను రోజుల కుపై గా ఉద్యమంలా జరిగిన ధాన్యం కొనుగోళ్లకు గురువారం తెరపడింది.
జిల్లాలో ఇదే తొలిసారి..
కొత్త జిల్లాలు ఆవిర్భవించినప్పటి నుంచి వరంగల్ రూరల్ జిల్లాలో గత సంవత్సరం యాసంగిలో ప్రభు త్వం రైతుల నుంచి నేరుగా 1.94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. జిల్లా చరిత్రలో ఇదే రికార్డు. ఈ సారి యాసంగిలో రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికా రులు అంచనా వేశారు.
అయితే ఊహించని రీతిలో 2.60 లక్షల టన్నుల ధా న్యాన్ని సేకరించారు. అంచ నాకు మించి అదనంగా మరో ముప్పైశాతం కొనుగోలు జరగటంతో అధికారులు సైతం ఆశ్యర్యపోయారు. ప్రభుత్వ మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా ఇంత పెద్దమొత్తంలో ధాన్యం కొనడం జిల్లాలో ఇదే తొలి సారి అని చెప్పవచ్చు. 48 వేల మంది రైతుల నుంచి కొన్న 2.60 లక్షల టన్నుల ధాన్యం విలువ సుమారు రూ. 490 కోట్లకుపైగా ఉంటుందని పౌరసరఫ రాల సంస్థ అధికారులు తెలిపారు. ఈ ధాన్యాన్ని జిల్లా లోని 22 బాయిల్డ్, 39 రా రైస్మిల్లులకు కేటాయిం చినట్లు వెల్లడించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొను గోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, ట్రాన్స్పోర్టుపై కలెక్టర్ హరిత వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్, డీఆర్డీవో ఎం సంపత్రావు, డీసీవో సంజీవరెడ్డి, పౌరసరఫరాల సంస్థ డీఎం భాస్కర్రావు, స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయి లో యాసంగి ధాన్యం కొనుగోలు, రవాణాను పర్యవేక్షిం చారు. ప్రధానంగా ధాన్యం ట్రాన్స్పోర్టు సమస్య తలెత్తడంతో ఒక దశలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, గండ్ర వెంకటర మణారెడ్డి వాహనాలను సమకూర్చేందుకు చొరవ తీసుకున్నారు.
పూర్తిగా కొనుగోలు చేశాం
భాస్కర్రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
జిల్లాలో ఈసారి ఆలస్యంగా యాసంగి ధాన్యం దిగు బడులొచ్చాయి. దీంతో సెంటర్లలో ధాన్యం కొను గోలు లేటుగా మొదలైంది. అయినా పక్కా ప్రణాళికతో రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించాం. కొన్ని సెం టర్లలో గురువారం వరకు కొనుగోలు జరిగింది. అన్ని సెంటర్లను కూడా క్లోజ్ చేశాం. కొనుగోలు కేంద్రాల వద్ద మిగిలి ఉన్న ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది రెండుమూడ్రోజుల్లో పూర్తవుతుంది. ప్రొక్యూర్మెంటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.