పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ లో యూనిట్ మెంబర్స్ రెండో షెడ్యూల్ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపనున్నారని తెలుస్తోండగా..దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
సాగర్ చంద్ర డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తూ, స్క్రీన్ ప్లే బాధ్యతలు చూస్తున్నారు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా సాయిపల్లవి, రానాకు జోడీగా ఐశ్వర్యరాజేశ్ కనిపించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.