రౌడీ బ్రాండ్తో బట్టల దుకాణాన్ని ప్రారంభించి రౌడీ బాయ్గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ స్టార్ హీరో ఏషియన్ సినిమాస్తో కలిసి మహబూబ్ నగర్లో ఒక మల్టీప్లెక్స్ను ఆవిష్కరిస్తున్నారు.
ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (ఏవీడీ సినిమాస్) పేరుతో ఈ మల్లీప్లెక్స్ రూపొందగా, రీసెంట్గా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. వాటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.త్వరలోనే ఏవీడీ సినిమాస్ లాంచింగ్ డేట్ని ప్రకటించనున్నారు.
ఏవీడీ సినిమాస్ లో ఈ ఏడాది దసరా నుండి సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఏఎంబీ పేరుతో మల్లీ ప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టగా, త్వరలో బన్నీ కూడా థియేటర్ ప్రారంభించనున్నాడు. కాగా, విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో పాపులారిటీ తెచ్చుకోగా, ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో “లైగర్” అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానున్నట్టు తెలుస్తుంది.