యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణ గాధ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర క్యాస్ట్కి సంబంధించి రోజురోజుకు కొత్త వార్తలు వస్తున్నాయి. కాజోల్ని ఎంపిర చేశారని, ప్రభాస్ పెద్దనాన్న కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తాజాగా వత్సల్ సేథ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలాసింది. ‘కొత్త ఆరంభం.. #ఆదిపురుష్’ అంటూ వత్సల్ సేథ్ ట్వీట్ చేశారు. దర్శకుడు ఓం రౌత్ని కూడా ఇందులో ట్యాగ్ చేశారు. దీంతో వత్సల్ ఈ సినిమాలో నటిస్తున్నారని అర్ధమైంది. . గతంలో ఆయన టార్జాన్ ది వండర్ కార్, సల్మాన్ జైహో, తాజాగా మలాంగ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.