బాలనటుడుగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్రన్ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీనివాస్ బండారి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అసలేం జరిగిందంటే..? శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ నాయికలు. అక్టోబర్1న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ముక్కోణపు ప్రేమకథతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి.