అల్లు అర్జున్ పిల్లలకు సంబంధించిన వీడియోలు లేదంటే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయంటే అవి కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా బన్నీ సతీమణి స్నేహారెడ్డి .. అర్హకు సంబంధించిన ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అర్హ చెస్ బోర్డ్లోని పావులని కదుపుతూ ఒక క్రమ పద్దతిలో పేర్చి ఆటకు సై అంటుంది. ఈ వీడియో నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అల్లు అర్జున్ కూడా అప్పుడప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు కరోనా వలన బన్నీఇంటికే పరిమితం కావడంతో కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్నిగడుపుతున్నాడు. లాక్డౌన్ తర్వాత తిరిగి పుష్ప చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఇందులో రష్మిక మందాన కథానాయికగా నటిస్తుంది.