మొదటి దశలో 6వేల మంది.. రెండో దశలో 1400 మంది దానం
విషమ పరిస్థితుల నుంచి బయటపడ్డ 12,400 మంది రోగులు
ప్లాస్మా దానానికి కొవిడ్ను జయించిన వారు ముందుకు రావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు దాదాపు 60 మంది వలంటీర్లు ప్లాస్మా దానం చేసేవారిని, ప్లాస్మా అవసరం ఉన్నవారిని సమన్వయ పరుస్తూ.. విషమ పరిస్థితుల్లో ఉన్నవారిని కాపాడుతున్నారు. ఎస్సీఎస్సీ వలంటీర్లు, యంగీస్థాన్, రాబిన్హూడ్ ఆర్మీ, ఐ ఫోకస్, ఐ ఫౌండేషన్, వందేమాతరం యువజన సంఘం, సెయింట్ జోసెఫ్ కాలేజీ విద్యార్థులు, కోఠి ఉమెన్స్ కాలేజీ, యూత్ ఫర్ సేవా సంస్థలకు చెందిన వలంటీర్లు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని సీపీ అన్నా రు. సైబరాబాద్ కొవిడ్ కంట్రోల్ రూం-9490617440 ద్వారా లేదా donateplasma. scsc.inలో ప్లాస్మా ఇచ్చేవారు, ప్లాస్మా కావాల్సిన వారు పేరు నమోదు చేసుకోవచ్చని సీపీ వివరించారు. గత ఏడాది అందరి సహకారంతో ఈ కంట్రోల్ రూం, ఎస్సీఎస్సీ, వలంటీర్ల ద్వారా దాదాపు 6 వేల మంది ప్లాస్మా దానం చేయగా.. 10 వేల మం దికి ఉపయోగపడిందన్నారు. రెండో దశలో 1400 మంది ప్లాస్మా దానం చేయగా, 2400 మంది బాధితులు అనారోగ్యం నుంచి బయటపడ్డారని తెలిపారు.