న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కొవిడ్ ప్రళయం అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్నది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలోనూ ఒక్కరోజులో నమోదు కానన్ని కేసులు మనదేశంలో 24 గంటల్లో నమోదయ్యాయి. బుధవారం నుంచి గురువారం ఉదయానికి 3,14,835 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,59,30,965కు చేరింది. బుధవారం దేశవ్యాప్తంగా 16,51,711 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 3,14,835 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఉదయం వెల్లడించింది. 2,104 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 1,84,657కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల 14.38 శాతం అంటే ఆ సంఖ్య 22,91,428కి పెరిగింది. ఇప్పటివరకు 1,34,54,880 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 84.46 శాతానికి పడిపోయింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.16 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 61,911, కర్ణాటకలో 13,762, తమిళనాడులో 13,258, ఢిల్లీలో 12,887, పశ్చిమబెంగాల్లో 10,710, ఉత్తర్ప్రదేశ్లో 10,346 కేసులు రికార్డయ్యాయి.