సినీ ఇండస్ట్రీకి ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. అక్కడ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్స్ విషయంలో ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఇది చూసిన తర్వాత సినిమా నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ రేట్లను పెంచుకుంటామని సినీ పెద్దలు పెట్టిన అర్జీని పక్కనబెట్టి.. ఇప్పట్నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. మొన్న వకీల్ సాబ్ సినిమా సమయంలో కూడా ఇదే జారీ చేసింది జగన్ సర్కార్. కొన్నేళ్ళలో ఎన్నడూ లేని విధంగా అప్పుడు వకీల్ సాబ్ సినిమాను 50 రూపాయల టికెట్ కు అమ్మారు థియేటర్ యాజమాన్యం. దీనివల్ల తాము కోట్ల రూపాయలు నష్టపోతున్నాం అంటూ నిర్మాతలు మొర పెట్టుకున్నారు.
డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే విషయంపై జగన్ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఇవన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోయాయి. తాజాగా సినీ పరిశ్రమకు షాక్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..సినీ ప్రియులకు మాత్రం శుభవార్తే చెప్పింది. జులై 8 నుంచి ఏపీలో థియేటర్స్ తెరుచుకోనున్నాయి. అందుకే ఈ లోపు టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని చెప్పి…కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతి ఇచ్చినా…ఇప్పటికీ ఒక్క కొత్త సినిమా విడుదల కాలేదు.
దాంతో థియేటర్స్ మూతపడే ఉన్నాయి. థియేటర్లు ఓపెన్ చేస్తుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పైగా టికెట్ రేట్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో సినీ అభిమానులకు ఇది గుడ్ న్యూస్. కానీ రేట్లను ప్రభుత్వం నిర్దేశించే ధరకే విక్రయించాలన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీకి షాక్. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై సినీ పెద్దలు కొందరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి చర్చలు చేయాలని చూస్తున్నారు. మరి దీనిపై జగన్ ఏమంటారనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
రజినీకాంత్ నెక్ట్స్ సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలుసా..?
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్