దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోగా.. ఆపద్కాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు విరుష్క జోడీ ‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రూ.2 కోట్లతో ఈ ఫండ్ని ఫ్రారంభించిన విరాట్ దంపతులు వారం రోజులలో రూ.11 కోట్లకు పైగా విరాళాలు సేకరించారు. వచ్చిన మొత్తాన్ని కరోనా రోగుల అవసరాలు తీరుస్తున్న యాక్ట్ గ్రాంట్స్ అసోషియేషన్కి ఇవ్వాలని ముందుగానే విరుష్క జోడీ నిర్ణయించింది.
తాజాగా అనుష్క శర్మ గర్భవతులకు, బాలింతలకు సహాయం చేసేందుకు ఓ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. హ్యాపీ టు హెల్ప్ పేరిట మహిళలకు వైద్య సహాయం అందించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్ సీడబ్ల్యు) ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ను తాను షేర్ చేసినట్టు ఇన్స్టాలో పేర్కొంది. ఎన్ సీడబ్ల్యు బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని అనుష్క పేర్కొంది.