హైదరాబాద్ : రేపటి వీర హనుమాన్ శోభాయాత్రకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన అనుమతి తెలిపింది. హనుమాన్ జయంతి సందర్భంగా వీహెచ్పీ, భజరంగ్దళ్ గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు శోభాయాత్ర తలపెట్టింది. ఈ శోభాయాత్రలో 21 మందికి మించి పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒక ద్విచక్రవాహనంపై ఒక్కరే శోభాయాత్రలో పాల్గొనాలంది. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శోభాయాత్రకు అనుమతి తెలిపింది. కాగా శోభాయాత్రను వీడియో చిత్రీకరించి నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని వీహెచ్పీ, భజరంగ్దళ్ను ఆదేశించింది.