హైదరాబాద్ : కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఆక్సిజన్ బ్యాంకులు వారం రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజన్ ట్యాంకుల నిర్వహణ బాధ్యతలను అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులకు అప్పగించనున్నారు.