ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
కోర్ట-చెనాక బ్యారేజీ పరిశీలన
జైనథ్, మే 21 : చనాక కొరటా బ్యారేజీ నిర్మా ణం పూర్త్తయితే ఆదిలాబాద్ నియోజకవర్గంలో 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నా రు. శుక్రవారం మండలంలోని హత్తిఘాట్లో చేపట్టిన పంప్హౌస్ పనులను అధికారులు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంప్హౌస్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మోటర్ల బిగింపు, విద్యుత్ పనులు తర్వగా పూర్తి చేయాలన్నారు. ఈ బ్యారేజీ నిర్మా ణం పూర్తయితే మూడు మండలాలు సస్యశ్యా మలమవుతాయని పేర్కొన్నారు. అనంతరం హత్తి ఘాట్ పర్ధాన్గూడకు చేరుకుని గిరిజనులతో మా ట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. గూడ పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యా దవ్, నాయకులు మహేశ్కుమార్, తోట రమేశ్, తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు ప్రవీణ్, తాలాడే ఈశ్వర్, అధికారులు పాల్గొన్నారు.