కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా మారడంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కొందరు త్వరగానే కోలుకుంటున్నప్పటికీ, మరి కొందరి పరిస్థితి విషమంగా మారుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. తాజాగా టెలివిజన్ నటుడు అనిరుధ్ డేవ్ కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
గత వారం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అనిరుధ్ స్వయంగా ప్రకటించాడు. పరిస్థితి తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అందరు అనిరుధ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించండి అంటూ నటి ఆస్తా చౌదరి తన ఇన్స్టాలో పేర్కొంది. భోపాల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో అనిరుధ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయన వెంటనే ప్రత్యేక వాహనంలో ముంబై చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువగా ఉండడంతో అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఇవికూడా చదవండి
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ