మహేశ్ బాబు, రాజమౌళి సినిమా ఇంకా మొదలు కాకముందే చాలా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా మహేశ్ బాబు సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ కానీ.. మహేశ్ బాబు, రాజమౌళి కానీ స్పందించడం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై ఈ మధ్యే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో మహేశ్ బాబు సినిమా తెరకెక్కబోతుందని ఆయన చెప్పాడు. ఫేమస్ దక్షిణాఫ్రికా నవల రచయిత రాసిన ఒక కథ ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని చెప్పాడు.
ఇప్పటి వరకు మహేశ్ బాబు, రాజమౌళి సినిమా సింగిల్ స్టారర్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ తరహాలో ఇది కూడా మల్టీస్టారర్ అని ఇప్పుడు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తెలుగులో కాదు తమిళం నుంచి ఒక స్టార్ హీరోను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడు రాజమౌళి. ఆయన ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే కచ్చితంగా మహేశ్ బాబు తో పాటు మరో హీరో కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో .. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని అడ్వెంచరస్ థ్రిల్లర్ గా మహేశ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.
సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ నిర్మాణ రంగం వైపు వస్తున్నాడు. రాజమౌళి దాదాపు పదేళ్ల కింద ఈయనతో సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది తెరపైకి రాబోతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Pallavi Tamil | కోలీవుడ్ కమ్బ్యాక్ కు సాయి పల్లవి ప్లాన్..?
కైలాస మానస సరోవర్ యాత్రకు ఉపాసన కొణిదెల ?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Samantha | అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. మూడు నెలల గ్యాప్లో రెండు సినిమాలు