యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఛత్రపతి, బాహుబలి,బాహుబలి 2 చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు బాక్సాఫీస్ని ఎంతగా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్నట్టు ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.
రాజమౌళి సినిమా అంటే అది పక్కా హిట్ అని ఆయన గత సినిమాలు నిరూపించాయి. మరి అలాంటి హిట్ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ ఎందుకు భయపడుతున్నారో తెలుసా? ప్రభాస్ని జక్కన్న సంవత్సరాల పాటు హోల్డ్లో ఉంచుతాడని వారి భయం. బాహుబలి కోసం ప్రభాస్ ఏ సినిమాకి కమిట్ కాకుండా ఐదు సంవత్సరాల పాటు ఉన్నాడు. దీంతో ప్రభాస్ని వెండితెరపై చూడ్డానికి ఐదేళ్లు పట్టింది.
ఇప్పుడు ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి . ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలని చాలా సంవత్సరాల క్రితమే మొదలు పెట్టిందట. భారీ అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ బ్లాక్ చేసిందట మైత్రీ సంస్థ. త్వరలోనే ఈ రేర్ కాంబినేషన్ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.