చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ, మే 28 : సూపర్ స్ప్రెడర్స్ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం చీఫ్విప్ హన్మకొండ బాలసముద్రంలో చిరు వ్యాపారులకు టోకెన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ ని యంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఒక వైపు టెస్టింగ్ చేస్తూ నే, మరోవైపు వ్యాక్సినేషన్ చేస్తున్నారన్నారు. సూపర్ స్ప్రెడర్స్గా ప్రభుత్వం గుర్తించిన చిరు వ్యాపారులు, కూరగాయల విక్రయదారులు, టి ఫిన్ సెంటర్లలో పని చేసేవారు, జర్నలిస్టులు వ్యా క్సిన్ వేసుకోవాలన్నారు. ఇలాంటి గొప్ప ఆలోచనతో సీఎం కేసీఆర్ గ్రేటర్ వరంగల్ను 5 సెంటర్లుగా విభజించి 91,350 మందిని గుర్తించి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. ముందుగానే వారికి వ్యాక్సినేషన్ స్లిప్పులు ఇచ్చామన్నారు. స్లిప్పుల్లో వ్యాక్సిన్ వేసుకొనే తేదీ, సమయం ఉంటుందన్నారు. 20 రోజుల పాటు వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్వో రాజిరెడ్డి పాల్గొన్నారు.