సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తె చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సిరుతయి శివ తెరకెక్కిస్తుండగా, ఇందులో ప్రకాశ్రాజ్, సురేశ్, ఖుష్బూ సుందర్, మీన, నయనతార, కీర్తి సురేశ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 4న దీపావళి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే డిసెంబర్లో అన్నాత్తె చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుండగా, రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేరిన ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చాయి. ఈక్రమంలో రజనీకాంత్కు కొన్ని నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దాదాపు నాలుగు నెలల పాటు విశ్రాంతి తర్వాత తలైవా అన్నాత్తె షూటింగ్ మొదలు పెట్టారు.
ఇటీవల చిత్ర బృందం హైదరాబాద్లో అన్నాత్తె తాజా షెడ్యూల్ మొదలు పెట్టగా, లొకేషన్లో దర్శకుడు, రజనీకాంత్ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పిక్లో రజనీకాంత్ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంకు డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్. ఎడిటర్గా రూబెన్ వ్యవహరిస్తున్నారు. కరోనా ఉదృతంగా ఉన్న ఈ సమయంలో రజనీకాంత్ షూటింగ్ చేయడం గొప్ప విషయమే.