ముంబై: కరోనా ఉద్ధృతితో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తనవంతు సాయాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు దవాఖానల్లో ఆక్సిజన్ కొరత ఉందన్న వార్తల నేపథ్యంలోఆయన స్పందించారు. గుజరాత్లోని జావ్ునగర్లో గల రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను మహారాష్ట్రకు ఉచితంగా పంపిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయంతో 100 టన్నుల ఆక్సిజన్ త్వరలో మహారాష్ట్రకు చేరుకోనున్నది.