ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్స్ హవా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలు మల్టీ స్టారర్స్లో నటించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు రామ్, రవితేజ కాంబినేషన్లో మరో మల్టీ స్టారర్ చిత్రం రూపొందనుందనే ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నాడని, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది.
అనిల్ రైటర్ గా ఉన్నప్పటి నుండి రామ్ తో మంచి అనుబంధం ఉంది, ఇక రవితేజతో రాజా ది గ్రేట్ అనే సినిమా చేశాడు. వీరిద్దరిని ఒప్పించిన అనీల్ రావిపూడి వచ్చే ఏడాది చివరలో ఈ ఇద్దరితో మల్టీ స్టారర్ చేయనున్నట్టు సమాచారం. మరి ఈ మల్టీ స్టారర్ తనదైన స్టైల్లో ఫన్గా తెరకెక్కిస్తాడా, లేదంటే సరికొత్త పాయింట్తో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.