లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. హత్రాస్ జిల్లాలో ఓ వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి చేరుకుని ఆమెను కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. బాలిక తల్లి పైనా నిందితుడు కాల్పులు జరపగా ఆమె తప్పించుకున్నారు. నిందితుడిని మధురకు సమీపంలోని హసన్ గ్రామానికి చెందిన నరేంద్ర అలియాస్ రింకూగా గుర్తించారు. జిల్లాలోని కైలోర గ్రామంలో గురువారం ఈ ఘటన జరగగా బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.
కాల్పుల శబ్ధాలతో అక్కడికి చేరుకున్న స్ధానికులు రింకూను పట్టుకోగా అతడి స్నేహితుడు పారిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలితో నిందితుడు ఏడాదిగా ఫేస్ బుక్ వేదికగా స్నేహం చేస్తున్నాడని, ఇద్దరి మధ్య ఏదో విషయమై బేధాభిప్రాయాలు తలెత్తడంతో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు.