ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. జావెద్ అక్తర్ వేసిన పరువునష్టం కేసులో ఈ బెయిల్ మంజూరీ అయ్యింది. ఇవాళ ఆ కేసులో కోర్టు ముందు కంగనా హాజరైంది. బెయిల్ వారెంట్ను రద్దు చేయాలని ఆమె కోరారు. బెయిల్ వచ్చేందుకు అప్పీల్ దరఖాస్తు చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. రెండు రోజుల క్రితమే కంగనా నటించిన తలైవీ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.