మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వేలేరు/ధర్మసాగర్, జూన్ 16: దేశ ఆహార అవసరాలను తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జి ల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని 8 రై తు వేదికలను బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ప్రారంభించారు. వేలేరు మం డలంలోని సోడషపల్లిలో నిరంజన్రెడ్డి మా ట్లాడుతూ.. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో 63.25లక్షల మందికి 7520 కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు.