యాంకర్గా, నటిగా తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. నటనతో పాటు గ్లామర్తో అశేష ప్రేక్షకాదరణ పొందిన అనసూయ కరోనా వలన తన బర్త్ డే వేడుకలని ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య సింపుల్గా జరుపుకుంది. తన బర్త్ డేకు సంబంధించిన ఫొటోలను అనసూయ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్గా మారాయి. అయితే అనసూయ బర్త్డే కేక్పై మైక్ బొమ్మని డిజైన్ చేయించగా, అది స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
అనసూయ బర్త్డే పార్టీలో యాంకరమ్మ భర్త, పిల్లలు వెరైటీ గెటప్స్లో కనిపించి సందడి చేశారు. ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే రీసెంట్గా ఈ అమ్మడు థ్యాంక్ యూ బ్రదర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా వలన ఈ చిత్రం ఆహాలో విడుదలైంది. ఇందులో అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి . ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప, ఖిలాడి సినిమాలలో నటిస్తుంది.