కానింగ్ పుర్బా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానింగ్ పుర్బా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ ఆవరణలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ మద్దతుదారులు హింసకు దిగినట్లు టీఎంసీ నేత సౌకత్ మొల్లా ఆరోపించారు. మొత్తం 31 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల వద్ద 144 సెక్షన్ విధించారు. కోవిడ్19 నిబంధనల ప్రకారమే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. కీలకమైన సౌత్ 24 పార్గనాస్ జిల్లాలో ఇవాళ 16 స్థానాలకు ఓటింగ్ చేపడుతున్నారు. హౌరా జిల్లాలోని ఉలుబేరియా ఉత్తర్ నియోజకవర్గంలో రిజర్వ్ ఈవీఎంతో బంధువు ఇంట్లో పడుకున్న సెక్టార్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు.