కాప్రా/రామంతాపూర్, జూన్ 30: ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధి హెచ్ఎండీఏ లేఅవుట్లోని శిల్పారామం సమీపంలో జూన్ 21న కాలిన స్థితిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడంతో హెచ్ఎండీఏ సూపర్వైజర్ నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. ఐడీపీఎల్ కాలనీకి చెందిన బాలరాజు (22) జూన్ 20 సాయంత్రం నుంచి కనిపించడం లేదని, విధుల నుంచి ఇంటికి వెళ్లిన అతడు స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగిరాలేదని బాలానగర్ పీఎస్లో కేసు నమోదైంది. అనుమానాస్పద మృతుడిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా చనిపోయిన యువకుడు బాలరాజేనని పోలీసులు గుర్తించారు. అనుమానితులను తమదైనశైలిలో విచారించి.. హత్యకు దారితీసిన పరిస్థితులను రాబట్టారు.
ప్రధాన నిందితుడు మహేశ్కు బాలరాజు ఆరేండ్లుగా పరిచయమున్నది. 20న మధ్యాహ్నం మహేశ్ తన స్నేహితులు నాగరాజు, సాయిలతో సనత్నగర్ జింకల బావి కల్లు కంపౌండ్లో కల్లు తాగుతుండగా, బాలరాజు అక్కడకు వచ్చి వారితో కలిసి మద్యంతో పాటు కల్లు తాగాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తన ఫోన్ కనిపించకపోవడంతో బాలరాజుపై అనుమానం వచ్చిన మహేశ్.. అతడి ఇంటికి వెళ్లి అడుగగా, తనకు తెలియదని చెప్పాడు. దీంతో స్నేహితులతో కలిసి బాలరాజును వెంట బెట్టుకొని చిలుకానగర్లోని తన ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ ఫోన్ గురించి అడుగుతూ.. బాలరాజును మహేశ్ విపరీతంగా కొట్టడంతో అతడు ఫోన్ను తాను పనిచేసే కిరాణాషాపు యజమాని దేవేందర్కు ఇచ్చినట్టు చెప్పాడు. రాత్రి 10.30 గంటలకు మహేశ్ పెద్ద అన్న నరేశ్, తమ్ముడు సుధీర్ మహేశ్ ఇంటికి బాగా తాగిన స్థితిలో వచ్చారు. బాలారాజును వారంతా చితక బాదడంతో అతడు వారి దెబ్బలకు మృతిచెందాడు. మృతదేహాన్ని మహేశ్ ఆటోలో తరలించారు. సుధీర్ బైక్పై వెంటరాగా, హెచ్ఎండీఏ లేఅవుట్లో కిరోసిన్పోసి తగలబెట్టారు. మహేశ్, ఆయన భార్య విజయ, నరేశ్, సుధీర్, నిందితులకు ఆశ్రయం ఇచ్చిన కేతావత్ రవిలను పోలీసులు అరెస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనన్న భయంతో ప్రేమజంట ఆత్మహత్య
జులై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి కేటీఆర్
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్