ఢిల్లీ ,జూన్ 21: దేశంలో గతకొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డీజిల్ ధర పలుచోట్ల రూ.100 చేరుకుంది. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది.
పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పులేదు. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 27సార్లు పెరిగాయి. కేవలం మే నెలలోనే 16సార్లు పెరిగాయి. 48 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.6.82, లీటర్ డీజిల్ పై రూ.7.24 పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.22, లీటర్ డీజిల్ రూ.87.97గా ఉంది. గంగానగర్లో పెట్రోల్ రూ.108.37, డీజిల్ రూ.101.12, ముంబైలో పెట్రోల్ రూ.103.36, డీజిల్ రూ.95.44గా ఉంది.