మంచాల మార్చి 27: వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురియడంతో వాగు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వ్యవసాయ బోరు బావుల్లోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో యాసంగిలో వరి భారీగా సాగు చేశా రు. మంచాల మండలంలోని వివిధ గ్రామా ల్లో ఉన్న బోరు బావుల కింద 7వేల 954 ఎకరాల్లో వరిసాగు చేయడంతో ఎటు చూసి నా పచ్చని పొలాలతో కనువిందు చేస్తున్నా యి. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియ క పోవడంతో వరి సాగుపై రైతులు మక్కువ చూపలేదు. ఈ సంవత్సరం అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా వర్షాలు కురియ డంతో అధిక మొత్తంలో సాగు చేశారు. పెట్టుబడి కింద ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున అందజేయడమే కాకుండా సబ్సిడీపై ఎరువులు, విత్తనాలను, వ్యవసాయ బావులకు 24 గంటల ఉచిత విద్యుత్ను అందజేసున్నది. ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మండలంలో అత్యధిక స్థాయిలో వరి సాగుచేయడంతో మండలంలోని ఎల్లమ్మతండా నుంచి లోయపల్లి వరకు పచ్చని పొలాలతో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పంటపొలాలను చూస్తూ రైతన్నలు ఆనందంతో మురిసిపోతున్నారు. మంచాల మండలంలో 5వేల 395 వ్యవసాయ బావుల కింద 7వేల 954 ఎకరాల వరి పంటను సాగు చేశారు. అం దులో 13 వేల 842మంది రైతులకు రైతు బంధు పథకం కింద 17 కోట్ల 5లక్షల 80వేల 144రూపాయలను ప్రతి ఆరు నెలల ఒకసారి 5వేల చొప్పున రైతుకు ప్రభుత్వం అందజేస్తున్నది. రైతు భీమా పథకం కింద 2018 నుంచి 2020వరకు 108 మంది రైతులు చనిపోగా వారికి 5కోట్ల 40లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేసింది