బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆపదలో ఉన్న వారికి సాయం అందిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. గతంలో ఎంతో మందికి సాయాలు చేసిన బిగ్ బీ కొన్ని సందర్భాలలో ఆ సాయాల గురించి బహిరంగంగా చెప్పుకోరు. తాజాగా ఆయన అయాంష్ అనే 17 నెలల చిన్నారికి సాయం అందించేందుకు సిద్ధమయ్యారు.ఆ మొత్తం ఎంతనేది మాత్రం సీక్రెట్గా ఉంచారు.
వివరాలలోకి వెళితే ప్రస్తుతం అమితాబ్ హోస్ట్గా కౌన్ బనేగా కరోడ్ పతి 13వ సీజన్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ షోకి ఫరాఖాన్, దీపికా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో గెలిచిన మొత్తాన్ని మస్క్యులర్ అట్రోఫీ తో బాధపడుతున్న పిల్లల కోసం అందజేస్తామని కొరియోగ్రాఫర్ కం దర్శకురాలు ఫరాఖాన్ అన్నారు . రోగగ్రస్తులైన కిడ్స్ కోసం చాలా ఖరీదైన ఇంజెక్షన్ ను కొనుగోలు చేయనున్నట్లు ఫరా వెల్లడించారు.
అయాన్ష్ రెండు సంవత్సరాల వయసులో ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అయిన జోల్జెన్స్మా అనే ఔషధం తీసుకోవాల్సి ఉంటుంది. దాని ధర 16 కోట్లు. అది అతని ప్రాణాన్ని కాపాడుతుంది. గేమ్లో గెలిచిన మొత్తాన్ని ఆ చిన్నారికి ఇవ్వాలని అనుకుంటున్నాం అని ఫరా తెలియజేసింది. దీనికి స్పందించిన అమితాబ్.. ఈ విషయం గురించి చెప్పాలా వద్దా అనేది నాకు తెలియదు. ఫరాకు నేను వ్యక్తిగతంగా కూడా సహకారం అందించాలనుకుంటున్నాను. ఆ మొత్తాన్ని నేను తర్వాత మీకు చెప్తాను. నేను ఇక్కడ చర్చించాలనుకోవడం లేదు అని అమితాబ్ ఈ సందర్భంగా చెప్పారు.