మైలార్దేవ్పల్లి, మే 16 : కరోనాను ఆసరాగా చేసుకుని నకిలీ శానిటైజర్లు విక్రయిస్తున్న ముగ్గురిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5లక్షల విలువగల నకిలీ శానిటైజర్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్కాలనీలో ఓ ఇంట్లో శ్రీ భూవి ప్రొడక్ట్ పేరుతోఎస్.సుబ్రమణ్యం, బి.శ్రీనివాస్, కె.సుస్మిత నకిలీ శానిటైజర్లను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసి.. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రూ.5లక్షల విలువగల నకిలీ శానిటైజర్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.