కోల్సిటీ, ఏప్రిల్ 20: రాజకీయాలకు వన్నె తీసుకువస్తున్న వ్యక్తి మంత్రి కొప్పుల ఈశ్వరన్న అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని మనోచైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రంలో మంగళవారం మంత్రి కొప్పుల పుట్టినరోజును పురస్కరించుకొని మనోచైతన్య ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనోచైతన్య మానసిక వికలాంగుల వృత్తి విద్యా కేంద్రం నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.10లక్షలు అందించడం జరిగిందన్నారు. ఈశ్వరన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నగర పాలక సంస్థ మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కార్పొరేటర్లు, నాయకులు శ్రీనివాస్, గోపాల్, రాజన్న తదితరులున్నారు.
పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 20: పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా విజిలెన్స్, మానిటరింగ్, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కమిటీ సభ్యులు కొంకటి లింగమూర్తి కేక్ కట్ చేశారు. నాయకులు గాండ్ల వెంకన్న, బొంకూరి రాజయ్య, శంకర్, మారుతి, అభి, రాజు పాల్గొన్నారు.
జూలపల్లి, ఏప్రిల్ 20: జూలపల్లి, కుమ్మరికుంట, అబ్బాపూర్ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ కేక్ కట్ చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కూసుకుంట్ల రమాదేవి, దండె వెంకటేశం, సమేచినేని సంతోష్రావు, వీర్ల మల్లేశం, పుల్లూరి వేణుగోపాల్రావు, విశారపు వెంకటేశం, లోక రవీందర్రెడ్డి, తోట ముత్తులింగం, గాండ్ల చంద్రయ్య, జంగం సతీశ్, శాతళ్ల కాంతయ్య, బీరయ్య, కనకరాజు, తేజ, శ్రీధర్, అజిత్, రాయలింగం పాల్గొన్నారు.
ధర్మారం, ఏప్రిల్ 20: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ధర్మారం సర్పంచ్ పూస్కూరు జితేందర్రావుతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు తుమ్మల రాంబాబు, గుర్రం మోహన్రెడ్డి, గూడూరి లక్ష్మణ్, నోముల వెంకటరెడ్డి, పాకాల రాజయ్య, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫీ, ఎండీ హఫీజ్, బొంగాని తిరుపతి, దొనికెని తిరుపతి, జైన రాజమౌళి, బాస తిరుపతిరావు, దేవి నళినీకాంత్, సల్వాజి మాధవరావు, శంకరయ్య, రాజారాం పాల్గొన్నారు. నంది మేడారంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అంజన్న దీక్ష స్వీకరించిన టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శి దేవి నళినీకాంత్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామంతుల శంకర్, నాయకులు గోళ్ల సంతోష్, దారవేని అంజి, నడిమెట్ల ప్రవీణ్, గోరువంతుల అంజిబాబు, రాచూరి రాజేశ్, సాన శ్రీకాంత్, సాన భూమేశ్ పాల్గొన్నారు. రచ్చపల్లిలో హనుమాన్ దీ క్షాపరులకు భిక్ష పెట్టారు. టీఆర్ఎస్వీ మండల ఉపాధ్య క్షుడు బెల్లాల సతీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మంలో సర్పంచ్ మోర సుధాకర్, ఎంపీటీసీ బెల్లాల రోజా రాణి, కొండగట్టు ఆలయ మాజీ డైరెక్టర్ జక్కుల దామో దర్రావు, తిరుపతి, సురేశ్, వెంకటేశం పాల్గొన్నారు.
ఇంద్ర కీలాద్రిలో..
మంత్రి కొప్పుల జన్మదిన వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంద్రకీలాద్రి గుట్టపై ఘనంగా నిర్వహించా రు. తెలుగు రాష్ర్టాల్లోని కొప్పుల అభిమానులు, పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్వీ నాయకులు బండి సురేశ్, కొప్పుల రవి, మంత్రి మేనల్లుడు ఆముల పరశురాం, కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మెండెం రాంబాబు, విజయవాడ మాల యువత అధ్యక్షుడు కొప్పుల వాసు, గుంటూరు జిల్లా మాలమహానాడు నాయకుడు కొప్పుల మహేశ్ ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు చేయించారు.
రామగిరి, ఏప్రిల్ 20: ఆర్జీ -3 డివిజన్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సెంటినరీకాలనీలో కేక్ కట్ చేశారు. ఆర్జీ -3 టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, నాయకులు బక్కయ్య, శ్రీనివాస్, రామారావు, మల్లేశ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కోల్సిటీ, ఏప్రిల్ 20: గోదావరిఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్రావు ఆధ్వర్యంలో మంత్రి ఈశ్వర్ పేరిట అర్చన చేశారు. అడప అనిత శ్రీనివాస్, కొంకటి పోశం, కళావతి, శ్రీదేవి, వెంకన్న ఉన్నారు.
గోదావరిఖని, ఏప్రిల్ 20: సింగరేణి ఆర్జీ-1 జీడీకే-1వ గనిపై టీబీజీకేఎస్ బ్రాంచ్ సెక్రటరీ బాలయ్య, పిట్ సెక్రటరీ రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో గని మేనేజర్ రమేశ్బాబు, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్రావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. పిట్ ఇంజినీర్ శివకుమార్, హనుమంత్రావు, టీబీజీకేఎస్ నాయకులు సుధాకర్, ఐలయ్య, ప్రభాకర్, అంకుల్, స్వామి గౌడ్, నారాయణ, శ్రీనివాసరెడ్డి, సత్తయ్య, రవీందర్, భూమయ్య ఉన్నారు. ఆర్జీ-1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ రాంచందర్ ఆధ్వర్యంలో యూనియన్ ఉపాధ్యక్షుడు దామోదర్రావు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వివిధ యూనియన్ల నుంచి కార్యకర్తలు కనకయ్య, రాంబాబు, వెంకట్రావు టీబీజీకేఎస్లో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. జాహిద్ పాషా, గంగాధర్, కుశనపల్లి శంకర్, సత్యనారాయణ, రాజిరెడ్డి, ఉదయభాను, రవీందర్రెడ్డి, చిందం శ్రీనివాస్, లింగయ్య వెంకట్రాజం, నామని శ్రీను, ఖాసీం, పిడుగు శ్రీను, రాము తదితరులున్నారు.
గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనకం శ్యాంసన్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. నాయకులు దామోదర్, శం కర్, వెంకటేశం, వెంకటేశ్, కృష్ణ, రమేశ్, గంగాధర్, శేషగి రి, శంకర్, బాలయ్య, రాంచందర్, రమేశ్రెడ్డి, నర్సయ్య, మల్లయ్య, శ్రీనివాస్, వెంకటరాజం, సదయ్య ఉన్నారు.పాలకుర్తి, ఏప్రిల్ 20: మండలంలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యారాంరెడ్డి ముంజంపల్లిలో తన ఇంట్లో మొక్కలు నాటారు. విండో చైర్మన్ బయ్యపు మనోహర్రెడ్డి, వైస్ఎంపీపీ ఎర్రంస్వామి, మార్కెట్కమిటీ చైర్మన్ అల్లం రాజయ్య, ఎంపీటీసీ అతిక్, సింగిల్విండో వైస్చైర్మన్ సతీశ్, నాయకులు గోపాల్, కిరణ్, ఖాదర్పాషా, కిషన్నాయక్, మధునయ్య, షేకేలాల్ తదితరులున్నారు.