న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు విరివిగా వైద్య సహాయం అందున్నది. పలు దేశాలు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఔషధాలు పంపుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా భారత్కు వైద్య సామగ్రిని అందించింది. 1,056 వెంటిలేటర్లు, 43 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రత్యేక కార్గో విమానంలో పంపింది. ఆ విమానం బుధవారం ఢిల్లీ చేరగా వాటిని అన్లోడ్ చేశారు.
మరోవైపు గత వారం రోజులుగా పలు దేశాల నుంచి సుమారు 3000 టన్నుల వైద్య సహాయ సామగ్రి ఢిల్లీకి చేరింది. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ ట్యాంకర్లు, కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర ఔషధాల వంటివి అందాయి. అయితే అవసరమైన రాష్ట్రాలకు వీటిని సరఫరా చేయకపోవడంపై కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.