ఎస్పీ డాక్టర్ చేతన
జిల్లా వాప్తంగా 350కి పైగా ఏర్పాటు చేశాం
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పోలీసు స్టేషన్కు రావాలి
నారాయణపేట, ఏప్రిల్ 18 : పోలీస్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే పోలీ స్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నీ నేస్తం’ బాక్సుల్లో ఫిర్యాదులను వేయాలని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణ, వారి స మస్యలు తెలుసుకోవడం కోసం జిల్లాలోని వివిధ గ్రామాల్లో 350కి పైగా ఫిర్యాదు బాక్సులను ఏ ర్పాటు చేశామని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అత్యవసరమైతే తప్ప ఎ లాంటి ఫిర్యాదులు ఉన్నా పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన ‘నీ నేస్తం’ బాక్సుల్లో వేయాలని ఆమె చెప్పారు. పోలీస్ అధికారులు భౌతిక దూ రం పాటిస్తూ మాస్కులు ధరించాలని, పోలీస్ స్టేషన్ పరిసరాలను ప్రతిరోజు శానిటేషన్ చేయించాలన్నారు. ప్రజలు ‘నీ నేస్తం’ బాక్సులతోపాటు వాట్సాప్ నంబర్ 7901400100కు ఫిర్యాదుల ను పంపించవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని, కచ్చితంగా అవసరమైతేనే ఫిర్యాదుదారుడు తప్పనిసరిగా మా స్కు ధరించి పోలీస్ స్టేషన్కు రావాలని కోరారు.
ఇవి కూడా చదవండి
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే