కరోనా సెకండ్వేవ్ మహారాష్ట్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడిప్పుడే అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సినిమా షూటింగ్లకు అనుమతినిచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణలకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో అమీర్ఖాన్ తనయుడు జునైద్ఖాన్ అరంగేట్ర చిత్రం ‘మహారాజ’ సెట్స్పైకి వెళ్లింది. ప్రభుత్వం షూటింగ్లకు అనుమతినిచ్చిన తర్వాత ముంబయిలో సెట్స్మీద కొచ్చిన తొలి చిత్రం ‘మహారాజ’కావడం విశేషం. వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న 25మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ను ప్రారంభించారు. జూనియర్ ఆర్టిస్టులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించి సెట్స్లోకి అనుమతించినట్లు చిత్రబృందం తెలిపింది. ఓ చారిత్రక కథతో ‘మహారాజ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.