మన తారలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా హీరోలు మల్టీ ప్లెక్స్ బిజినెస్లపై ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ లాంచ్ చేయగా, విజయ్ దేవరకొండ ఏఎండీ అనే మల్టీ ప్లెక్స్ ప్రారంభించాడు.ఇక అల్లు అర్జున్ ఏఏఏ అనే మల్టీ ప్లెక్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడ మరో క్రేజీ మల్టీ ఫ్లెక్స్ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్టులో ఒకరు కాదు..ఇద్దరు కాదు..ముగ్గురు హీరోలు పాలు పంచుకోవడం విశేషం.
ఏషియన్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్..టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, రానాతో కలిసి ఏఎమ్ బి విక్టరీ పేరుతో అనే మల్టీప్లెక్స్ని స్టార్ చేయబోతున్నారట.ఇటు మాల్ గా, అటు మల్టీ ఫ్లెక్స్ గా ఇది తయారు అవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్సన్ థియేటర్ స్థలంలో ఈ భారీ మాల్ రూపు దిద్దుకోబోతున్నట్టు సమాచారం. అతి త్వరలోనే దీనిపై ఓక్లారిటీ రానుంది.