ముంబై: శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తరుణంలో లంకతో పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగనుండడంతో ఈ టీమ్ఇండియా-2 కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్నది. జూలై 13 నుంచి 25 మధ్య శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లకు 20 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. కెప్టెన్గా ధవన్, ఉపసారథిగా స్టార్ బౌలర్ భువనేశ్వర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఐపీఎల్లో అదరగొట్టిన దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్, నితీశ్ రాణా, చక్రవర్తి లాంటి కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కగా.. పృథ్వీషా, కుల్దీప్ యాదవ్, చాహల్ పునరాగమనం చేశారు.
భారత జట్టు: ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ (వైస్ కెప్టెన్), పృథ్వీషా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, శాంసన్, చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, సైనీ, చేతన్ సకారియా