భువనేశ్వర్ : కరోనా నివారణకు మాస్కే ఆయుధమని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కోడై కూస్తున్న విషయం విదితమే. ప్రజలు మాత్రం ఈ నిబంధనను పాటించడం లేదు. ఒడిశా భద్రక్ జిల్లాలోని ఓ దేవాలయానికి శుభరంజన్ మేకప్ తన కుటుంబ సభ్యులతో వెళ్లాడు. అయితే శుభరంజన్ మాస్కు ధరించలేదు.
దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేశాడు. తన కుమారుడిపై చేయి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని భద్రక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రికార్డు చేసిన దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని భద్రక్ ఎస్పీ చరణ్ మీనా పేర్కొన్నారు.