పెరిగిన పంటల సాగు విస్తీర్ణం.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
జహీరాబాద్, మార్చి 29: నారింజ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జాలాలు పెరిగిపోవడంతో పంటల సాగు పెరిగిందని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తెలుపుతున్నారు. గత వేసవిలో నారింజ ప్రాజెక్టు గేట్లుకు మరమ్మతులు చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు కావడంతో రాష్ట్ర మంత్రి తన్నీర్ హరీశ్రావు, కలెక్టర్ హనుమంతరావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్లు పూడిక తీతతో పాటు గేట్లు మరమ్మతులు చేసేందుకు కృషి చేశారు. గేట్లుకు మరమ్మతులు చేయడంతో వరదనీరు లీకేజీ కాకుండా ఉంది. దీంతో నారింజ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బీ) గ్రామ శివారులో బీదర్ -జహీరాబాద్ రోడ్డు పై నారింజ ప్రాజెక్టు ఉంది. గత ఏడాది గేట్లుకు మరమ్మతులు చేయకపోవడంతో నీరు వృథాగా లీకేజీ అయ్యింది. దీంతో నారింజ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయలని జహీరా బాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పలుమార్లు మంత్రి హరీశ్రావును కోరా రు. వెంటనే స్పందించిన మంత్రి గత ఏప్రిల్, మే మాసంలో నారింజ ప్రాజెక్టులో పూడిక తీత, గేట్లుకు మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. నీటివనరుల శాఖ అధికారులు టెండర్లు వేసి జూన్లో పనులు పూర్తి చేశారు. నారింజ నుంచి నీరు కర్ణాటక వైపు పోకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరిలో గత ఐదు సంవత్సరాలుగా నారింజ ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండేది కాదు. ఈ ఏడాది ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో రైతులు వ్యవసాయ బోర్లు, బావుల కింద పంటలు సాగు చేసుకుంటు న్నారు. పంటల సాగు విస్తరణ పెరిగిందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు తెలుపు తున్నారు. వ్యవసాయ బావులు, బోరుల వద్ద రైతులు చెరుకు, ఆలుగడ్డ, అల్లంతోపాటు కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు.