న్యూఢిల్లీ: ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా అవతరించిన ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ 1980వ దశకం ప్రారంభంలో వజ్రాల వ్యాపారిగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత తన సోదరుడు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బిజినెస్లో సహకరించేందుకు గుజరాత్కు చేరారు. అటుపై 1988లో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ స్థాపించారు.
అటుపై క్రమంగా గౌతం ఆదానీ తన వ్యాపారాన్ని పలు రంగాలకు విస్తరించారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్, రీసోర్సెస్, లాజిస్టిక్స్, అగ్రి బిజినెస్, రియల్ ఎస్టేట్, ఫైనాన్సియల్ సర్వీసెస్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, డిఫెన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.
అరేబియా సముద్ర కోస్తా తీరాన గల ముంద్రా నౌకాశ్రయ నిర్వహణ కాంట్రాక్ట్ను 1995లో పొందింది ఆదానీ పోర్ట్స్ సంస్థ. ఈ నాడు దేశంలోకెల్లా ప్రైవేట్ రంగంలో అతిపెద్ద నౌకాశ్రయ, విమానాశ్రయ సంస్థ గౌతం ఆదానీ పోర్ట్స్.
దేశవ్యాప్తంగా ప్రభుత్వేతర యాజమాన్యం గల అతిపెద్ద ఇంధన ఉత్పత్తిదారు. బొగ్గు ఉత్పత్తిలో లీడర్గా నిలిచింది ఆదానీ గ్రూప్. అంతే కాదు ఆస్ట్రేలియా తదితర దేశాలకు బొగ్గు మైనింగ్ విస్తరించింది.
దేశీయ మౌలిక వసతుల రంగంలో ఆధిపత్యం సాధన దిశగా ఆదానీ గ్రూప్ వడివడిగా ముందుకెళ్తున్నది. గత మార్చిలో గంగవరం పోర్టులో 58.1 శాతాను టేకోవర్ చేసింది ఆదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్.
అంతకుముందు ముంబైలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, పర్యవేక్షణ కాంట్రాక్ట్ను జీవీకే గ్రూప్ నుంచి గతేడాది సెప్టెంబర్లో టేకోవర్ చేసింది ఆదానీ గ్రూప్. ఇటీవలే ప్రైవేటీకరించిన అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల్లో నిర్వహణకు 50 ఏండ్ల హక్కులను గెలుచుకుంది.
69 బిలియన్ల డాలర్ల సంపద గల గౌతం ఆదానీ.. తన కంటే ముందు వరుసలో ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని త్వరలోనే దాటేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముకేశ్ అంబానీ సంపద 77 బిలియన్ల డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్
గంటకు రూ.75 కోట్లు పెరిగిన గౌతం ఆదానీ సంపద!
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు