అమరావతి : చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులు ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. హేమంత్ (15) అనే బాలుడు తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.. తీవ్రంగా గాయపడిన అనీశ్, హర్షిత్ అనే ఇద్దరిని హాస్పిటల్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. వీరిని మాకవరపాలెం వాసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.