న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా వైరస్ బారినవారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని చెప్పారు. గత ఏడాది దేశవ్యాప్తంగా కరోనా వల్ల 1.46 లక్షల మంది చనిపోగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 18-35 వయసు గ్రూపు వారే ఎక్కువని చెప్పారు. రోడ్డు ప్రమాదాల గురించి తమ ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.