టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేష్ చాలా సంవత్సరాల తర్వాత నాంది చిత్రంతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో మాత్రమే నటించాలని చూస్తున్నాడు. తాజాగా “సభకు నమస్కారం” పేరుతో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం కాగా, చిత్రాన్ని సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ గా దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడట. యువ నటుడు నవీన్ చంద్ర “సభకు నమస్కారం”లో ఒక ముఖ్యమైన పాత్రలో నవీన్ చంద్ర నటించనున్నట్టు సమాచారం.
మరోవైపు మంచు మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మాస్మి చిత్రంలో కూడా అల్లరి నరేష్ నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే సోమవారం అల్లరి నరేష్ దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన నరేష్ దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు తర్వాత వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వ్రస్తాలు బహూకరించారు.