ముంబై ,జూన్ 19:దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన FAME (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)-II ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల సవరణలు చేసింది. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు దిగొస్తున్నాయి.
తాజాగా దేశంలోని అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ15,600 వరకూ తగ్గాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్ను బట్టి ఈ సబ్సిడీ మారుతుంది. హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న పాపులర్ స్కూటర్ ఆప్టిమా హెచ్ఎక్స్ డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.15,680 తగ్గి, రూ.58,990 గా ఉంది. అలాగే, సింగిల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.8,040 తగ్గి, రూ.53,600 గా ఉంది.